నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - ఆగస్ట్ 22 : కురబలకోట మండలంలో బద్దిపల్లి లో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి శుక్రవారం సాయంత్రం జరిగింది. ముదిపేడు యస్.ఐ దిలీప్ కుమార్ కథనం మేరకు ముదివేడు పంచాయితీ, బద్దిపల్లెకు చెందిన ఆనందరెడ్డి భార్య అశ్విని 27 సం " ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతిపై అనుమానాలు ఉన్నాయని అశ్విని తల్లి దండ్రులకు ఆరోపించారు. కరెంట్ షాక్ తగిలిందని సమాచారం రావడంతో తాము కూతురు ఇంటికి వెళ్లిచూడగా ఉరి వేసుకున్నట్లు ఉందన్నారు
Admin
Namitha News