నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఆగస్ట్ zß తంబళ్లపల్లె శ్రీ మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్టుకు రూ 17 లక్షలు విరాళం అందింది. మండలంలోని ఎర్ర సానిపల్లి సర్పంచ్ సుగుణ, వీరభద్ర కుటుంబ సభ్యులు మల్లయ్యకొండ మల్లికార్జున స్వామి అన్నదాన ట్రస్టుకు సోమవారం రూ 17 లక్షలు ట్రస్ట్ సభ్యులు సుధాకర్ రెడ్డి, రమణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మురళి లకు అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి భక్తులకు అన్నదానం చేస్తున్న అన్నదాన ట్రస్టుకు4విరాళం అందజేయడం మా పూర్వజన్మ సుకృతమని తెలిపారు. దాతల దాతృత్వం పై ట్రస్టు సభ్యులు కొనియాడారు.
Admin
Namitha News