నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 13 ః తంబళ్లపల్లె మండలం లో సోమవారం గ్రామీణ ప్రాంత ప్రజలు భోగి పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. భోగి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు అందులో గొబ్బెమ్మలు అమర్చి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని మారు మూల కుగ్రామాలలో సైతం భోగి పండుగ సందర్భంగా సాయంత్రం రైతులు పెద్ద ఎత్తున భోగి మంటలు వేసుకున్నారు. మండలంలోని పలు గ్రామాలలో మల్లికార్జున స్వామి మహిళా కళాకారుల బృందం భోగి మంటలు చుట్టూ కోలాటాలు, గొబ్బెమ్మ పాటలతో సందడి చేశారు. పిల్లలు, పెద్దలు భోగి మంటలు చుట్టూ చేరి చలి కాచుకున్నారు. సంక్రాంతి సందర్భంగా సోమవారం పండుగ కోసం పూలు, పండ్లు, కూరగాయలు, ఇంటి సరుకులు ధరలు ఆకాశాన్ని అంటాయి. పండుగ సందర్భంగా చిన్నారుల నెత్తిన భోగి పండ్లు వేసి వారు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో అభివృద్ధిలోకి రావాలని పెద్దలు దీవించారు.
Reporter
Namitha News