నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - ఏప్రిల్03 : కురబల కోట మండలం అంగళ్ళు వద్ద నున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (డేటా సైన్స్ ) బి.టెక్ రెండవ సంవత్సరము చదువుతున్న విద్యార్ధి సి.బాలాజీ పుత్తూరు సిద్దార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన జాతీయ స్థాయి హ్యాక్ ఫెస్టా 2K25 పోటీలలో ప్రతిభ కనపరచి రెండవ బహుమతిగా పదిహేనువేలు నగదు పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ అన్నారు. ఈ హ్యాకథాన్ లో విద్యార్థులు, స్టార్టప్ లు, టెక్నాలజీకి సంబంధిచిన తమ సృజనాత్మకతను, సమస్య పరిష్కార నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశాన్ని పొందారన్నారు . ముఖ్యంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), సైబర్ సెక్యూరిటీ, బ్లాక్చెయిన్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై చర్చలు, ప్రాజెక్టుల అభివృద్ధి, ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ టెక్నాలజీ నిపుణులు, పరిశ్రమ నాయకులు, శాస్త్రవేత్తలు హాజరై తమ అనుభవాలను పంచుకున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్సు విభాగానికి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ బి. భాస్కర్ సహాయ సహకారంతో ప్రతిభ కనపరిచిన బాలాజీ ని విభాగాధిపతి డాక్టర్ కుసుమ, కళాశాల కరెస్పాండంట్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్ తదితరులు అభినందనలు తెలియజేసారు.
Admin
Namitha News