నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ఐఏఎస్ అధికారి గిరిష పై సస్పెన్షన్ ఎత్తివేసిన జాతీయ ఎన్నికల కమిషన్ అమరావతి : లోక్ సభ తిరుపతి బై ఎలక్షన్లో ఓటర్ కార్డులను అక్రమంగా డౌన్లోడ్ చేసిన ఆరోపణలలో అప్పటి ERO పిఎస్.గిరిషా ఐఏఎస్(2012), అన్నమయ్య జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ జనవరి మాసంలో జాతీయ ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ఐఏఎస్ అధికారి గిరిషా పై సస్పెన్షన్ ఎత్తివేస్తూ, ఆరోపణలపై విచారణను పెండింగ్లో ఉంచినట్లు జాతీయ ఎన్నికల కమిషన్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ కేస్ జవహర్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేసింది. గిరిషకు ఎన్నికల విధులు అప్పగించకుండా, ఇతర శాఖలో పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశాల్లో పేర్కొంది.
Admin
Namitha News