నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 11 : తంబళ్లపల్లె మండలం లోని రైతులకు లాభసాటి వ్యవసాయానికి పొలం పిలుస్తోంది కార్యక్రమం విజయ గీతిక గా నిలిచినట్లు వ్యవసాయ అధికారి రమణ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం చేలూరు వాండ్లపల్లి పంచాయతీ పరిధిలో పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా రబీ వేరుశనగ పంటను పరిశీలించారు. రైతులు భవిష్యత్తులో తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించడానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, తీసుకోవలసిన జాగ్రత్తలు, పలు సూచనలు, సలహాలు చేశారు. రైతులు సేంద్రియ ఎరువులతో పంటలు పండించడంపై దృష్టి సారించాలని ఆర్గానిక్ వ్యవసాయం భవిష్యత్తులో సత్ఫలితాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. రైతులు తమ భూములను భూసార పరీక్షలు నిర్వహించుకొని అందుకు తగిన పంటలు వేసుకొని అధిక దిగుబడును సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ పంటల సాగుకు సంబంధించి స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ అంబేద్కర్, స్థానిక రైతులు లోకేశ్వర్ రెడ్డి , ఐసులు కృష్ణప్ప శ్రీనివాసులు , మాధవ రెడ్డి రాజా రమేష్ , సురేంద్ర , పాల్గొన్నారు
Reporter
Namitha News