Thursday, 16 April 2026 08:01:04 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

స్వర్ణాంధ్ర 2047 సాధనకు అధికారులు కలసి రండి - దాసరిపల్లి జయచంద్రారెడ్డి

Date : 09 June 2025 10:20 PM Views : 264

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జూన్ 9 : గత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్వర్ణాంధ్ర 2047 సాధనకు ఆరు మండలాల అధికారులు కలసి రావాలని కోరారు. సోమవారం తంబళ్లపల్లెలో జరిగిన ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆయన అధికారులతో ఫోన్లో మాట్లాడారు. తంబళ్లపల్లె నియోజకవర్గం లో సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధర, ప్రతి ఒక్కరికి పని, మహిళలకు రక్షణతో పాటు స్వయం ప్రతిపత్తి కల్పించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని తంబళ్లపల్లె నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులు సైతం తంబళ్లపల్లె అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కలసి రావాలని కోరారు. ఇప్పటికే తంబళ్లపల్లి అభివృద్ధిలో అధికారుల పాత్ర మరువలేనని భవిష్యత్తులో అధికార యంత్రాంగం సమిష్టి కృషితో మరింత ప్రోత్సాహకరంగా సహకరిస్తే పార్టీలు, ప్రాంతాలకతీతంగా అభివృద్ధిలో ఆగ్రస్థానాన తంబళ్లపల్లె నిలిపి ముఖ్యమంత్రికి కానుకగా ఇద్దామని ప్రోత్సహించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపుకు నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుడు తంబళ్లపల్లె అభివృద్ధి, సంక్షేమానికి అధికారులతో ఐకమత్యం, సమన్వయం తో ప్రజల సమస్యల పరిష్కారానికి తమ వంతు సహకారం అందించాలని ఇందుకు మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి సహకరిస్తానన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :