Thursday, 16 April 2026 06:14:09 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

పెన్షన్లు పంపిణీ పై సూచనలు

1వ తేదీ నే వంద శాతం పంపిణీ చేయుటకు కృషి చేయండి - ఎంపీడీఓ కృష్ణమూర్తి

Date : 30 July 2024 06:53 PM Views : 215

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లి జూలై 30 : తంబళ్లపల్లె మండలం లో ఆగస్టు 1వ తేదీ సామాజిక వృద్ధాప్య, వితంతు , దివ్యాంగులు, ఒంటరి మహిళలు పెన్షన్లు సాయంత్రానికి 100% పంపిణీ కోసం సచివాలయ అధికార యంత్రాంగం కృషి చేయాలని ఎంపీడీవో కృష్ణమూర్తి సూచించారు. మంగళవారం ఆయన ఉద్యోగులతో సమీక్ష జరిపి జూలై 31వ తేదీ బ్యాంకుల నుండి పెన్షన్ల మొత్తాన్ని డ్రా చేసి ఆగస్టు ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుండి పెన్షన్లను ఇంటింటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కోరారు. ఒకటి అర లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే మరుసటి రోజు వారికి పెన్షన్లు అందించడానికి ముందు ఉండాలన్నారు. పెన్షన్ల లబ్ధిదారులు ఆగస్టు ఒకటో తేదీ కచ్చితంగా ఇండ్ల వద్దనే ఉండి పెన్షన్లు అందుకొని అధికార యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ సమీక్షలో ఈఓఆర్ డి దిలీప్ కుమార్ నాయక్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, వివేకానంద, సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :