నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 28 : నవరాత్రులు సందర్బంగా అమ్మవారి ఆలయాలు, గ్రామల్లో కొలువైన దుర్గామాతకు, మండల కేంద్రంలో అతి పురాతన శ్రీలక్ష్మి జనార్ధనస్వామి, బల్లసముద్రం వాళీశ్వర స్వామి ఆలయం లలో భక్తి శ్రద్ధలతో పూజలు జరుతున్నాయి. ఏడో రోజు ఆదివారం మండలంలో ని బజారు వీధిలో వెలిసిన శ్రీ కన్యాకాపరమేశ్వరి ఆలయం లో ఆలయ అర్చకులు శ్రీనివాస్ ఆచార్ అమ్మవారి కి అభిషేకాలు, అర్చన లు నిర్వహించి పలు రకాల పుష్పాతో అమ్మవారిని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు చెక్కర పొంగలి నైవేద్యం సమర్పించారు.
Admin
Namitha News