నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్టు 29 : అన్నమయ్య జిల్లా మండలంలోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమల రెడ్డిపల్లె గ్రామంలో శుక్రవారం అంగరంగ వైభవం గా వినాయక నిమర్జనం జరిగింది. మేళతాళాల నడుమ పురవీదుల్లో ఊరేగింపు.మహిళ లు స్వామికి మంగళ హారతులు పట్టి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. జరిగింది. బానసంచాలు కాలుస్తూ యువతీ,యువకులు చిన్న పిల్లలు రంగులు చల్లుకుని కోలా హాలంగా నిమర్జనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.గ్రామాల్లో భారతి, హరీష్, భరత్, గణేష్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు . ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్సై డి. రమేష్ బాబు పలు గ్రామాల్లో నిర్వహిస్తున్న వినాయక స్వామి వారి నిమిజ్జనం పర్వదినం రోజున సుడిగాలి పర్యటన చేశారు. పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహించారు. సాయంత్రం చెరువులో స్వామి వారిని నిమర్జనం చేశారు. నిమిర్జనానికి విచ్చేసిన భక్తులకు కొండా మరి దామోదర్ రెడ్డి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Admin
Namitha News