నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 19 : ఈ-వ్యర్థాలతో పాటు పనికిరాని ప్లాస్టిక్ వస్తువులను రీసైకిలింగ్ ద్వారా సంపూర్ణ పర్యావరణం సాధ్యమవుతుందని స్పెషలాఫీసర్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్ పిళ్ళై పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా మండలం లోని అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు ఈ-వ్యర్ధాల రీ సైక్లింగ్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఇండ్లతోపాటు దుకాణాలలోని ఈ వ్యర్థాలను సేకరించాలని సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ పరిధిలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పారిశుద్ధ్యం పనుల్లో పాల్గొని భావితరాలకు పరిపూర్ణ పర్యావరణాన్ని అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం ద్వారా పారిశుద్ధ్యం పాటించి పర్యావరణ పరిరక్షణకు సహకరిస్తానని అందరి చేత ప్రమాణం చేయించారు. ఈ అవగాహన ర్యాలీ ఎంపీడీవో కార్యాలయం నుండి క్రాస్ రోడ్ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ త్యాగరాజు, ఏవో థామస్ రాజా, ఏఈలు వినోద్, సుజాత, ఈసీ మహేష్, సీసీలు కత్తి నరసింహులు, రమణ ,టెక్నికల్ అసిస్టెంట్లు సుజాత, పుష్ప కుమారి, బాలగంగాధర్, భూదేవి కార్యదర్శులు సోమశేఖర్, రామకృష్ణ,టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, జనసేన మండల నాయకుడు ఎద్దుల నర్సింహులు, సిద్ధమ్మ, రామలక్ష్మమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
Namitha News