నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : త్యాగం, సహనం, ఐకమత్యానికి ప్రతీకగా బక్రీద్ నిలుస్తోందని వైఎస్ఆర్ సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. దైవ ప్రవక్త ఇబ్రహీం స్ఫూర్తితో ప్రజలు సత్యం, న్యాయం,ధర్మం, త్యాగం, సహనం, పరోపకారం, బాధ్యతాభావం అలవరచుకోవాలని ఆయన కోరారు. దేవుడి దయతో ప్రజలందరూ ఆరోగ్యాలు, సుఖ శాంతులుతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జిల్లాలో ఎల్లప్పుడూ మత సామరస్యం వెల్లివిరియాలన్నారు.ఈ సందర్బంగా ముస్లిం సోదరులకు శ్రీకాంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు.
Admin
Namitha News