నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - అక్టోబర్ 01 : పెద్దమండ్యం మండలంలోని దిగువపల్లి పంచాయతీలో మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ట్రాక్టర్ కు నిప్పు పెట్టి కాల్చివేశారని దిగువపల్లికి చెందిన బి దయానంద రెడ్డి బుధవారం పెద్దమండ్యం పోలీసులు ఫిర్యాదు చేశాడు, ఫిర్యాదు మేరకు వివరాలు,,,,,,, తన వ్యవసాయం కోసం ట్రాక్టర్ ను కొనుగోలు చేసి తన నివాసం ఉంటున్న ఇంటికి సమీపంలో పొలం వద్ద టాక్టర్ ఉంచాడు, అయితే అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు తన టాక్టర్ కు నిప్పు పెట్టారని ఫిర్యాదుల పేర్కొన్నాడు, ఫిర్యాదు మేరకు తంబళ్లపల్లె ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో - ఏఎస్ఐ ఇసాక్ కేసు నమోదు చేశారు, సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్, క్లూ టీం, ఆర్ ఎఫ్ ఎస్ ఎల్ చేరుకొని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
Namitha News