నమిత న్యూస్ - National / చిత్తూరు : చెన్నై - జనవరి 27 : తిరుపతి నుండీ పుత్తూరు, నగిరి మీదుగా తిరుత్తణి కి మీదుగా వెళ్ళే జాతీయ రహదారి 716 ను వెడల్పు చేయడం లో భాగంగా నగరి వద్ద ఉన్న 600 సంవత్సరాల నాటి పురాతన సంస్కృతి సాంప్రదాయాలకు తలమానికంగా నిలుస్తున్న "కొండచుట్టు మండపం" ను యదావిధి గా ఉంచండి. కొండచుట్టు మండపాన్ని కూల్చాలన్న నేషనల్ హైవే అథారిటీ నిర్ణయాన్ని మార్చుకోవాలని, భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలని దాన్ని యధావిధిగా ఉంచి హైవే మార్గాన్ని సరిచేయాలని మాజీ మంత్రి శ్రీమతి ఆర్.కె.రోజా గారు మంగళవారం నాడు చెన్నై లోని NHAI అధికారులకి విజ్ఞప్తి చేశారు. మంగళవారం నాడు చెన్నై లోని NHAI ప్రధాన కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) ఎం.రవీంద్రరావు గారిని కలిసి ఈమేరకు ఆమె వినతి పత్రం ను సమర్పించారు.
ఈ సందర్బంగా మాజీ మంత్రి రోజా మాట్లాడుతూ కొండచుట్టు మండపాన్ని కూల్చరాదని తాను గతంలోనే పలుమార్లు అధికారులకు లిఖితపూర్వకంగా అభ్యంతరాలు తెలియజేశానని, దీనిపై కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందని ఆమె తెలియజేశారు. తమ అభ్యంతరం మేరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రస్తుతం దీనిపై మద్యంతర ఉత్తర్యూలు కూడా ఇచ్చిందని, WPNO 1822/2026 ఉత్తర్యూ మేరకు మండపం కూల్చివేతను ఆపివేయాలని కోరినట్లు తెలుపుతూ, హైవే వెడల్పు పనుల్లో స్వల్ప మార్పులు చేయడం ద్వారా దీన్ని యధావిదిగా ఉంచవచ్చని ఆమె అధికారులకు సూచించినట్లు తెలిపామని, 600సంవత్సరాల క్రితం శాల్వరాజులచే నిర్మించబడిన ఈ మండపంలో నిత్యపూజలు, అన్నదానం, ఉత్సవాల కొరకు పాలేగార్ చెంగమ్మ నాయని వారు భూములు కూడా కేటాయించి దాన్ని కాపాడుకొంటూ వస్తున్నారని అధికారులకు వివరించామని తెలిపిన ఆర్.కె. రోజా
Admin
Namitha News