నమిత న్యూస్ - Devotional / Annamayya : రాయచోటి : నమిత న్యూస్: మార్చి 12 :-అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం ఎండపల్లి గ్రామం కాలభైరవ స్వామి దేవాలయం నందు కర్ణాటక భక్తులకు శివరాత్రి సందర్భంగా దాదాపు 200 మందికి అన్న ప్రసాదాలు నిర్వహించినట్లు ఆలయ ధర్మకర్త పోలు సుబ్బారెడ్డి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయచోటి వీరభద్ర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులు రాయచోటికి దగ్గర ఉన్న శ్రీ కాలభైరవ స్వామి దేవాలయమునకు రాయచోటి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయమునకు రాచవీడు తిరుణాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు అలాగే ఎండపల్లి నందు ఉన్న కాలభైరవ స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చినట్లు దేవాలయం ప్రధాన అర్చకులు మహేష్ స్వామి మంగళవారం తెలిపారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ వచ్చినటువంటి భక్తులకు కుంకుమార్చన అభిషేకాలు అన్నప్రసాదాలు నమ్మకము చమకము శ్రీ లింగాష్టకం శ్రీ బిల్వాష్టకం శ్రీ శివాష్టకం శ్రీ చంద్రశేఖరాష్టకం శ్రీ కాలభైరవాష్టకం శ్రీ విశ్వనాథాష్టకం శ్రీ శివ పంచాక్షరి స్తోత్రం పారాయణం చేసినట్లు అర్చకులు తెలిపారు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రానికి ప్రతి వారం వారం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
Reporter
Namitha News