Friday, 31 July 2026 06:48:30 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో వైభవంగా విగ్రహల ప్రతిష్ట

Date : 27 February 2026 10:16 PM Views : 367

నమిత న్యూస్ - Devotional / Annamayya : తంబళ్లపల్లి - ఫిబ్రవరి 27 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ లో శుక్రవారం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, కవితమ్మల ఆధ్వర్యంలో ముగ్గురు దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం ఎమ్మెల్యే దంపతులు మల్లయ్య కొండ చేరుకొని మహా శివునికి అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి లు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యే దంపతులకు తీర్థప్రసాదాలు అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే దంపతులు తొలుత వెలుగు మల్లమ్మ నూతన ఆలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట, అనంతరం కొండకింద మదాతం బావి వద్ద వినాయక ఆలయం, ఆంజనేయస్వామి ఆలయాలలో స్వామివారుల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమాలు సదుం కు చెందిన ప్రధాన అర్చకులు రఘు, వేణు స్వాముల అర్చకత్వంలో జనవాహిని మధ్య కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు రఘు, వేణు స్వాములు హిందూ ధర్మ ఆచారాలు, ఆగమ శాస్త్రం ప్రకారం విగ్రహాలకు మంగళ వాయిద్యాలు, మంత్రోచ్ఛారణల మధ్య గణపతి పూజ, నవగ్రహాల పూజ, వాస్తు పూజ,జలాధివాసం,8 దాన్యాధివాసం, హోమం, యంత్ర ప్రతిష్ట అనంతరం దేవత మూర్తుల విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు నియమ నిష్టలతో నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప, దీప నైవేద్యాలు సమర్పించి మంగళ హారతులు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలకు వందలాదిగా భక్తులు, ప్రజలు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి నూతన విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కార్యక్రమాలు కనులారా వీక్షించి ఆస్వాదించారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :